![రోడ్డు వెడల్పులో బాధితులకు నష్టం కలిగించొద్దు : కలెక్టర్ సిక్తా పట్నాయక్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-sikta-patnaik-orders-not-to-cause-damage-to-victims-in-road-widening_5B49bOrVln.jpg)
నారాయణపేట, వెలుగు: రోడ్డు వెడల్పు పనులలో గృహ యజమానులకు నష్టం కలగకుండా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో తహసీల్దార్, మున్సిపల్ అధికారులు, బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.4200 స్క్వేర్ యాడ్ ప్రకారం రెసిడెన్షియల్ ప్లాట్స్ కు, రూ. 11,600 కమర్షియల్ షాప్ లకు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా188 మందికి గాను165 మంది పరిహారం తీసుకోవడానికి సమ్మతించినట్టు అధికారులు తెలిపారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ బెన్ షాలం, ఆర్డీవో రామచంద్ర, తహసీల్దార్, శ్రీనివాస్, నాగరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా వ్యవసాయ అధికారుల డైరీని ఆవిష్కరించారు.